రాయదుర్గం: పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో తాగనీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టిన స్థానికులు
రాయదుర్గం పట్టణం మొలకల్మూరు రోడ్డులో తాగునీటి కోసం స్థానికులు రోడ్డెక్కారు. గత ఏడెనిమిది రోజులుగా తాగునీరు సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రోడ్డు కు అడ్డంగా ఖాళీ బిందెలతో బైటాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే తమ ఏరియాలో తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.