మార్కాపురం: బొగ్గుని తరలిస్తున్న గూడ్స్ భోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరీగా తర్లుపాడు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సంఘటన
బొగ్గుని తరలిస్తున్న గూడ్స్ భోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరీగాయి. ఈ ఘటన మార్కాపురం జిల్లా తర్లుపాడు రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలం చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పి వేశారు. గూడ్స్ ట్రైన్ గుంటూరు నుంచి నంద్యాల జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే మంటలు ఏ విధంగా అంటుకున్నాయో తెలియవలసి ఉందని అధికారులు తెలిపారు.