కొండపి: పొన్నలూరు మండలంలో భార్యను వేధించిన భర్తకు 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సింగరాయకొండ కోర్టు
భార్యను వేధించిన భర్తకు సింగరాయకొండ కోర్టు గురువారం 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. పొన్నలూరు మండలానికి చెందిన ఓ వివాహితను ఆమె భర్త శారీరకంగాను మానసికంగాను వేధించాడు. 2016 సంవత్సరంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించింది.