మార్కాపురం: కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమం
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వాగుమడుగు అంబాపురం గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఏవో ప్రకాష్ రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్క రైతు ఫార్మా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రైతులకు ఎరువులు ఇవ్వాలంటే ఆ యాప్ కచ్చితంగా ఉండాలన్నారు. పంట పొలాలలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ నీటిని ఉపయోగించడం వల్ల పంట బెట్ట పరిస్థితి నుండి తప్పించుకుంటుందన్నారు. పచ్చి రొట్టె ఎరువులను వాడాలన్నారు