దర్శి: ప్రమాదాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Darsi, Prakasam | Jun 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పరిశీలించి ప్రమాదాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేరాలు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కట్టడి చేయగలుగుతున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.