రాయదుర్గం: జాజరకల్లు టోల్ ప్లాజా దగ్గర ఆయిల్ ట్యాంకర్, లారీ డి, దగ్దమైన వాహనాలు
డి.హిరేహాల్ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై జాజరకల్లు టోల్ ప్లాజా దగ్గర ఆయిల్ ట్యాంకర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డి.హిరేహాల్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వాహనాల్లో డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారని, వారి పరిస్థితి తెలియాల్సి ఉంది.