గిద్దలూరు: కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి లో భార్యను అనుమానంతో హత్య చేసిన భర్తను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వేరెడ్డి పల్లి గ్రామంలో ఈనెల 10వ తేదీన భార్యపై అనుమానం పెంచుకొని భర్త గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు భార్య జ్యోతిని హత్య చేసిన భర్త దావీదుని అదుపులోకి తీసుకున్నారు. సిఐ రామకోటయ్య వెల్లడించిన వివరాల మేరకు 17 సంవత్సరాల క్రితం గిద్దలూరు ఏబీఎం పాలెంకు చెందిన దావీదుకి కొమరోలు మండలం సర్వేరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జ్యోతి కి పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.