గిద్దలూరు: గిద్దలూరులో 2వ రోజు కూడా అట్టహాసంగా మహానాడు, గొడ్డలితో బాబాయిని ఎవరు వేసేశారో అందరికీ తెలుసన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ పై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలన్న నెరవేర్చినందుకే తమ పార్టీని వెన్నుపోటు పార్టీ అని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలితో సొంత బాబాయిని లేపేసింది ఎవరో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వేగంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.