రాయదుర్గం: నియోజకవర్గ వ్యాప్తంగా ఘటన మెహర్రం వేడుకలు, పలుచోట్ల పీర్ల అగ్నిగుండ ప్రవేశాలు
రాయదుర్గం నియోజకవర్గంలో మెహర్రం పీర్ల పండుగ అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. రాయదుర్గం మండలంలో డి. కొండాపురం, గుమ్మగట్ట మండలం నేత్రపల్లి, బూపసముద్రం, గలగల తదితర గ్రామాల్లో చక్కెర ఛదివింపులు పానకాల ఊరేగింపులతో సందడిగా మారాయి. అగ్నిగుండాలు వెలిగించి పీర్లతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. నేటి సాయంత్రం జలధికి తరలనున్నాయి. వేడుకలు తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.