ఉరవకొండ: రాకెట్లలో అత్యంత భక్తిశ్రద్ధలతో సుంకలమ్మ దేవి రథోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తజనం
ఉరవకొండ మండలం రాకెట్లలో గురువారం సుంకులమ్మ దేవి రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా తీసుకెళ్లి రథంలో ఉంచారు. అనంతరం భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు రథాన్ని ఆలయం వద్ద నుంచి గ్రామంలోని పురవీధుల గుండా లాగారు. జై సుంకులమ్మ తల్లి అనే నినాదాలు తో గ్రామం మారుమోగిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం తాండవించింది.