ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో శనివారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటికి వెళ్లి లబ్ధిదారులకే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీకి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు.