మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కొండేపల్లి రోడ్డులో లారీని అడ్డుగా పెట్టడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మార్కాపురం పట్టణం నుండి కొండేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ప్రతిరోజు రోడ్డుకు అడ్డుగా పార్సెల్ లారీ ఉంచడంతో స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ రోడ్డున వివిధ స్కూల్స్ కు సంబంధించిన బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. లారీ అడ్డుగా ఉండడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు