మార్కాపురం: జమ్మనపల్లిలో మైనార్టీ చైర్మన్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 34 కుటుంబాలు
మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో 34 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ చైర్మన్ మహబూబ్ వలి సమక్షంలో చేరికలు జరిగాయి. కాలనీలో మౌలిక వసతులు లేవని ఆయన అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కాలనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.