దర్శి: ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని హెచ్చరించిన దర్శి ఇన్చార్జి లక్ష్మి
Darsi, Prakasam | Apr 28, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో సోమవారం రాత్రి టిడిపి వైసిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పలువురికి టిడిపి నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ తీవ్రంగా ఖండించారు. సంబంధిత వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.