రాయదుర్గం: మహిళల బద్రతకు పెద్ద పీట : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళలు, బాలికల భద్రత పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. వారిపై ఎలాంటి ఆఘాయిత్యాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలకు ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేసిందన్నారు. తమ వద్ద ఉన్న ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ సమయంలోనైనా పోలీసులను సంప్రద