కొండపి: టంగుటూరు 16 నెంబర్ జాతీయ రహదారిపై లారీ, ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం లారీని ద్విచక్ర వాహనం ఢీకొనగా అదే ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.