మార్కాపురం: జిల్లా కేంద్రంలో విస్తృతంగా యోగ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ నారాయణరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో విస్తృత స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేయడం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.