రాయదుర్గం: వరదనీటి ప్రవాహం కారణంగా కణేకల్లు - మాల్యం రూటు బంద్
కణేకల్లు మండలంలోని వేదవతి-హగరి నది పరివాహక ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నదిలో వరదనీరు ప్రవహిస్తోంది. నీటి ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా కణేకల్లు నుండి మాల్యం వెళ్లే రహదారిని అధికారులు బంద్ చేశారు. ఆ దారి గుండా ఎవరూ వెళ్ల వద్దని బుధవారం ఉదయం జెసిబి సహాయంతో రోడ్డు కు అడ్డంగా మట్టివేసి రాకపోకలు నివారించారు. ప్రజలను రెవెన్యూ అప్రమత్తం చేశారు.