కొండపి: సింగరాయకొండ కందుకూరు జాతీయ రహదారిపై ఎండ తీవ్రతకు పగిలిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు అద్దం, పలువురికి గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ-కందుకూరు రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అద్దాలు ఎండ తీవ్రతకు ఒక్కసారిగా పేలిపోయాయి. ఒంగోలులో పెళ్లికి వెళ్లి కందుకూరు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అద్దాలు పగిలిన ఫోర్స్కు డ్రైవర్తోపాటు ముందు కూర్చున్న కొద్దిమందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.