యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2 లో టిబిఎమ్ మిషన్ దగ్గరికి వెళ్లి వివరించిన మంత్రి నిమ్మల రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్దా నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టన్నెల్ 2 లో 12 కిలోమీటర్లు దగ్గర టిబిఎం మిషన్ చిక్కుకుపోయిందని మంత్రి స్వయంగా చూయిస్తూ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టిబిఎం తొలగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఆ మిషన్ తొలగించకపోతే చుక్కనీరు కూడా టన్నెల్ నుండి బయటికి రాదన్నారు. మూడు వేల కోట్ల పనులు చేయాల్సి ఉన్న ప్రాజెక్టు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను మోసం చేశారని విమర్శించారు.