దర్శి: అద్దంకి దర్శి ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న నేల బావి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో అద్దంకి దర్శి ప్రధాన రహదారి పక్కన ఉన్న నేల బావి ప్రమాదకరంగా ఉంది. వాహనదారులు భయాందోళన గురవుతున్నారు. ప్రస్తుతం వినియోగంలో లేని ఈ భావి రహదారిని ఆనుకొని ఉండడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే హెచ్చరిక బోర్డులు రక్షణ కంచ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను వాహనదారులు విజ్ఞప్తి చేశారు.