మార్కాపురం: రాహుల్ గాంధీ చిత్రపటాలను కాల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బిజెపి నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాలను బహిరంగంగా కాల్చివేసి కాళ్లతో తొక్కి అవమానించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో సంబంధిత బిజెపి నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారు అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీలోనే రక్షణ ఉంటుందన్నారు.