Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపి టోకెన్ కోసం గంటల తరబడి రోగులు నిరీక్షణ

Rayadurg, Anantapur | Jun 23, 2026
పేదల పెద్దదిక్కుగా ఉన్న రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వైద్యం సంగతి అటుంచితే, కనీసం డాక్టర్‌ను కలిసేందుకు ఓపి టోకెన్ దొరకని పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది రోగులు, చంటి పిల్లలను ఎత్తుకున్న తల్లులు, వయో వృద్ధులు ఓపి టోకెన్ కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టోకెన్ ఇస్తుండటంతో, రోగుల వివరాలు నమోదు చేసి రసీదు ఇవ్వడానికి దాదాపు 5 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. వందల మంది రోగులకు కేవలం రెండు కౌంటర్లలో మాత్రమే రసీదులు జారీ చేస్తుండటంతో రద్దీని తట్టుకోలేకపోతున్నాయి.