యర్రగొండపాలెం: వెంకటాద్రిపాలెం గ్రామంలో డిజిటల్ మహానాడు కార్యక్రమం సందర్భంగా సీఎం కటౌట్ కు పాలాభిషేకం చేసిన మహిళలు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెంలో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినందుకు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. మహిళా అభివృద్ధి ఒక టిడిపి తోనే సాధ్యమవుతుందని పలువురు మహిళలు అన్నారు.