మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని బాలికల వసతి గృహం ఎదురుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ సాంబశివరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆర్ ఉమ్మడివరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.