గిద్దలూరు: రాచర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించి హెచ్చరించిన ఎస్సై కోటేశ్వరరావు
రోడ్డు ప్రమాదల నివారణకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. రాచర్ల పట్టణంలోని కంభం గిద్దలూరు రహదారిపై వాహనదారులకు ఎస్ఐ కోటేశ్వరరావు ప్రమాదలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అలానే వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలన్నారు. వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. అలానే పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులు ప్రయాణించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు