కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని ఫ్లై ఓవర్ పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సత్తగాత్రుడు టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.