గిద్దలూరు: రాచర్ల మండలంలో చోరీలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్సై కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి
దొంగతనాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు తమ ఇంటిలో బంగారు ఆభరణాలు నగదు ఉంచకుండా బ్యాంకు లాక్కర్లో భద్రపరుచుకోవాలని సూచించారు. అంతేకాకుండా పోలీసు వారికి లేదా మీ పక్కింటి వారికి ముందుగానే సమాచారం ఇవ్వడం మంచిది అని తెలిపారు. అలానే అనుమానస్పదంగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోటేశ్వరావు విజ్ఞప్తి చేశారు.