రాయదుర్గం: పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం, తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి
రాయదుర్గం పట్టణ శివారు కణేకల్లు రోడ్డులో గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న రాతిబావివంక గ్రామానికి చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి రాయదుర్గం నుండి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడ చేరుకుని రక్తస్రావంతో పడివున్న బాధితుడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.