దర్శి: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు నోట్ బుక్స్ అధికారేట్లకు విక్రయిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎంఈఓ మాలకొండయ్య కు వినతి
Darsi, Prakasam | Jun 17, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫాం తదితర వస్తువులు అధిక రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ సంఘ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాలకొండయ్యకు వినతిపత్రం అందజేశారు. సంబంధిత సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.