గిద్దలూరు: కొమరోలు మండలంలో వాహన తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని 25 మంది వాహనదారులకు జరిమానా విధించిన ఎస్సై నాగరాజు
నిబంధనల పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 25 ద్విచక్ర వాహనాలకు ఎస్ఐ నాగరాజు జరిమానా విధించారు. కొమరోలు మండలంలోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై శనివారం ఎస్సై నాగరాజు వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వాహనదారులను హెచ్చరించారు.