కొండపి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకోవాలని జరుగుమల్లి మండలంలో అభయ ఆంజనేయస్వామికి జనసేన నాయకులు పూజలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కొండపి జనసేన నాయకులు పూజలు నిర్వహించారు. మంగళవారం జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి డిప్యూటీ సీఎం పేరిట పూజలు చేయించారు. ఎండోస్కోపిక్ సైనస్ ప్రాబ్లంతో డిప్యూటీ సీఎం సర్జరీ చేయించుకున్నారని 10 రోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని నాయకులు తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకొని తిరిగి ప్రజలకు సేవ చేసేందుకు చురుగ్గా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని అన్నారు.