మార్కాపురం: ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... సుమారు 33 అర్జీలు వచ్చాయన్నారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని 15 రోజులలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్బార్ నిర్వహించామన్నారు.