రాయదుర్గం: ఆహారం కోసం వచ్చి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను తాకి షాక్ తో ఎలుగుబంటి మృతి
ఆహారం కోసం వచ్చిన ఎలుగుబంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తాకి షాక్కు గురై మరణించింది. రాయదుర్గం మండలం ఆర్బి వంక గ్రామంలోని జయరాం నాయక్ తోట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, అటవీ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పశు వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. సుమారు 3 ఏళ్ల వయసున్న మగ ఎలుగుబంటి మామిడి పండ్లు తిని వెళుతూ ట్రాన్స్ఫార్మర్ను తాకి మృతి చెందినట్లు వారు నిర్ధారించారు.ఇటీవలే ఆహారం, నీటి కోసం వచ్చి రాయదుర్గం కొండల్లో చిరుత, అలాగే పట్టణ శివారు వడ్రహొన్నూరు అ