మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఉచిత అంబులెన్స్ సర్వీసును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వెనుకబడిన ఈ ప్రాంతంలో రోజు పని చేసుకుంటేనే తినాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటి వారికి దాతల సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నవారికి సపోర్ట్ చేయాలన్నారు.