గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 23వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 23వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా సర్వేరెడ్డిపల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.