మార్కాపురం: జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన డీఈఓ సుబ్బారావు
మార్కాపురం జడ్పీహెచ్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో 21 మండలాల ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ... ప్రభుత్వ విద్య డాష్ బోర్డు లోని అంశాలు కులంకషంగా తెలుసుకోవాలన్నారు. ఎన్రోల్మెంట్ 100% చేయాలని డ్రాప్ 0 జీరో శాతం చేయుటకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు శాతం కచ్చితంగా మెరుగుపరచాలన్నారు. పాఠశాలల స్టార్ రేటింగ్ పెంచుకోవాలన్నారు.