రాయదుర్గం: మున్సిపాలిటీ స్థలం ఆక్రమించిన టిడిపి నాయకుడు : కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆరోపణ
మున్సిపాలిటీ స్థలాలు కబ్జాచేసి నిర్మాణాలు చేబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలోని 1 వ వార్డులో గతంలో మున్సిపాలిటీ మరుగుదొడ్లు ఉన్న స్థలంలో టిడిపి నాయకులు భవన నిర్మాణం చేపట్టారని తెలిపారు. కమీషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. విలువైన మున్సిపల్ స్థలాలు కబ్జా కు గురికాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.