కళ్యాణదుర్గం: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని చంపిన కేసులు ఉండవు: కంబదూరులో డీఎస్పీ రవిబాబు
మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే అలాంటి వారిని చంపిన కేసులు ఉండవని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అన్నారు. కంబదూరులో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మహిళలు, బాలబాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అఘాయిత్యాలకు పాల్పడితేనే చంపాలన్నారు. అలాకాకుండా ఉద్దేశపూర్వకంగా, కక్షల వల్ల ఎవరిని చెప్పకూడదన్నారు. అలా చేస్తే మాత్రం కేసులు పెడతామన్నారు. మహిళలు స్వీయ రక్షణ చేసుకోవాలన్నారు.