మార్కాపురం: కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టో దహనం చేసి నిరసన తెలిపిన పెద్దారవీడు వైసీపీ నాయకులు
పెద్దారవీడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు మండల నాయకులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోను దహనం చేసి నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని వారు విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు