కొండపి: జరుగుమల్లి మండలం నర్సింగోలులో అమావాస్య కారణంగా శనేశ్వర ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో శనైశ్వర జయంతి, శని అమావాస్య పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ సిద్ధాంతి రమణయ్య శాస్త్రి పర్యవేక్షణలో ఆలయంలోని ప్రత్యేక లింగరూప శని భగవానునికి విశేష పూజలు చేపట్టారు. స్వామివారికి శాస్త్రోక్తంగా తిల తైలాభిషేకం, ప్రత్యేక హోమం, జంబీరఫల రసాభిషేకం జరిపించారు. ఈ శనీశ్వరాలయంలో లింగ రూప శని దేవుని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.