రాయదుర్గం: అంగ సేవలు మరింత సమర్థవంతంగా అమలుకు కృషి : సిడిపిఓ లక్ష్మి ప్రసన్న
అంగన్వాడీ సేవలను మరింత సమర్థంగా అమలు చేసి చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థాయిలను మెరుగుపరుస్తామని రాయదుర్గం CDPO గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లక్ష్మీప్రసన్న తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో 185 అంగన్వాడీ కేంద్రాలున్నాయని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందేలా చూస్తామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సహకారంతో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని వెల్లడించారు.