గిద్దలూరు: కొమరోలు, రాచర్ల, గిద్దలూరులలో ఏప్రిల్ 11వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డి.ఈ.ఈ శేషగిరిరావు వెల్లడి
ప్రకాశం: రేపు అనగా ఏప్రిల్ 11వ తేదీ శనివారం గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలను విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శుక్రవారం డి.ఈ.ఈ శేషగిరిరావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్లలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గృహ, వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు