మార్కాపురం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు నియోజకవర్గ మాజీ ఇంచార్జి పివి కృష్ణారావు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య గురించి వివరించారు. కరోనా నుండి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నారు. కుటుంబంలో భర్త గాని భార్య గాని చనిపోతే వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు.