కొండపి: మంత్రి స్వామి తీవ్ర ఆగ్రహం, వైసిపి నాయకులు ఏ మొహం పెట్టుకొని రాజధాని కి వెళ్లారు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి.
మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్లు అమరావతిపై జగన్ అండ్ కో రాజధాని లో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి స్వామి విమర్శించారు. జగన్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిన్న ఏ మొఖం పెట్టుకొని అమరావతికి వైసిపి నేతలు వెళ్లారని ప్రశ్నించారు. వైసిపి హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు వేధింపులతో హింసించిన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.