యనకల్లు కు చెందిన ఆనంద్ మృతిపై ఎవరైనా అనవసరంగా వదంతులు క్రియేట్ చేస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనంద్ మృతిపై మొదట ఆత్మహత్యయని, ఆ తర్వాత హత్యయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు.పూర్తిస్థాయిలో విచారణ, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరు వదంతులు క్రియేట్ చేయొద్దన్నారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.