గిద్దలూరు: జిల్లాలో మంగళవారం రికార్డ్ స్థాయిలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత, రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు, వాతావరణ శాఖ హెచ్చరిక
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంటకే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపించడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. వాతావరణ శాఖ ఈనెల 23వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 43 నుంచి 44° వరకు ఉండే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.