రాయదుర్గం: మురడి ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.11,49,854
డి.హీరేహాల్ మండలంలో ప్రసిద్ధి చెందిన మురడి శ్రీ ఆంజనేయస్వామి వారి హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. గత 9 నెలల కాలానికి రూ.11,49,854 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈఓ నరసింహరెడ్డి తెలిపారు. పర్యవేక్షణ అధికారి వి.దేవదాస్, ప్రధాన అర్చకులు రామాంజనేయులు, పవన్ కుమార్, MPTC గంగాధర్, మాజీ సర్పంచ్ గంగన్న, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో ఈ లెక్కింపు చేపట్టినట్లు వెల్లడించారు. నగదు బ్యాంక్ లో జమ చేశామన్నారు.