గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో ద్విచక్ర వాహనదారిపై విరిగిపడ్డ వృక్షం, తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం ఓ భారీ వృక్షం నేలకొరిగి ద్విచక్ర వాహనదారుడు పై పడింది. దీంతో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తికి చేయి విరిగినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే చెట్టు విరిగిపడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా స్థానికులు తెలిపారు.