గిద్దలూరు: రాచర్ల మండలంలో డ్వాక్రా రుణాల రికవరీ 99 శాతం గా ఉన్నట్లు ఏపీఎం గోపాలకృష్ణ వెల్లడి
రాచర్ల మండలంలో 903 డ్వాక్రా మహిళ గ్రూపులు ఉన్నాయని నూతనంగా రాచర్ల ఏపీంగా బాధ్యతలు చేపట్టిన గోపాలకృష్ణ వెల్లడించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గోపాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం వార్షిక రుణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి సర్వే నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ తెలిపారు. 2026/27 సంవత్సరానికి గాను డ్వాక్రా మహిళ గ్రూపులకు ఎంత రుణాలు అవసరమో వారికి సుమారు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా అందిస్తామని తెలిపారు. రాచర్ల మండలంలో 99% రుణ రికవరీ ఉన్నట్లు ఏపీఎం అన్నారు.